మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం
By సుభాష్ Published on 10 May 2020 4:31 AM GMTఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఇంట్లో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు, సిబ్బంది వెంటనే రాయ్పూర్లోని శ్రీనారాయణ్ ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్పైనే అజిత్కు చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన అజిత్ జోగి వయసు 74 ఏళ్లు. 2000 నుంచి 2003 వరకూ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. అజిత్, ఆయన కుమారుడు ఉప ఎన్నికల వివాదంలో చిక్కుకుపోవడంతో ఆయన 2016లో కాంగ్రెస్ నుంచి తప్పుకున్నారు.
ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు శనివారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో వైద్యులు పేర్కొన్నారు. రాబోయే 48 నుంచి 72 గంటలు గడిస్తే ఆయన పరిస్థితి గురించి ఏమి చెప్పలేమని వైద్యులు తెలిపారు.