ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నలుగురు దుర్మరణం..

By అంజి  Published on  18 Feb 2020 7:35 AM GMT
ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నలుగురు దుర్మరణం..

ఉత్తరప్రదేశ్‌లో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు- బస్సు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన వారికి స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. కాగా అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.



Next Story