బడ్జెట్ 2020 ముఖ్యాంశాలు

By రాణి  Published on  1 Feb 2020 11:44 AM GMT
బడ్జెట్ 2020 ముఖ్యాంశాలు

ముఖ్యాంశాలు

  • 2020 బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి
  • వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి రంగాలకు పెద్దపీట
  • స్వచ్ఛభారత్, జల్ జీవన్ మిషన్ లకు పెరిగిన కేటాయింపులు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్ సభలో 2020 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలుగు ప్రజలకు నిరాశే మిగిలింది. మన తెలుగింటి కోడలు..మన రాష్ర్టాల కోసం కూడా మేలైన బడ్జెట్ ను ఇస్తుందనుకుంటే...అనుకున్న దానికంతా విరుద్ధంగా జరిగింది.

2020 బడ్జెట్ లో వివిధ రంగాలకు కేటాయించిన బడ్జెట్ వివరాలు

  • వ్యవసాయ రంగానికి రూ. 2.83 లక్షల కోట్లు.
  • గ్రామీణాభివృద్ధికి రూ. 1.23 లక్షల కోట్లు.
  • ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 15 లక్షల కోట్లు.
  • స్వచ్చ భారత్ మిషన్ కోసం రూ. 12,300 కోట్లు.
  • జల్ జీవన్ మిషన్ కు రూ. 3.06 లక్షల కోట్లు.
  • ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకానికి రూ. 6,400 కోట్లు.
  • ఆరోగ్య రంగానికి రూ. 69 వేల కోట్ల కేటాయింపు.
  • విద్యా రంగానికి రూ. 99,300 కోట్లు.
  • నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు రూ. 3 వేల కోట్లు.
  • టెక్స్టైల్ ప్రాజెక్టుకు రూ.1480 కోట్లు కేటాయింపు
  • డిజిటల్ ఎక్స్పోర్ట్ కు రూ.103 లక్షల కోట్లు
  • ఇండస్ట్రీ ఆండ్ కామర్స్ కు రూ.27300 కోట్లు
  • 2000 కిలోమీటర్ల స్ట్రాటజిక్ హైవేస్
  • రైల్వే ట్రాక్ పక్కన సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్స్
  • పదకొండు వేల కిలోమీటర్ల మేర రైల్వే లైన్ విద్యుద్దీకరణ
  • ముంబై అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ రైల్
  • Pop పద్ధతిలో నాలుగు స్టేషన్లు ఆధునీకరణ
  • సీ పోర్టుల పెంపు
  • మరిన్ని తేజస్ తరహా రైళ్లు
  • 2023 నాటికి ముంబై ఢిల్లీ ఎక్స్ ప్రెస్ వే
  • నదుల పక్కన పిపిపి పద్ధతిలో వృద్ధి ప్రాజెక్ట్స్
  • 2024 నాటికి 100 ఎయిర్ పోర్టులు
  • పవర్, రెన్యువల్ ఎనర్జీకి రూ.22000 కోట్లు
  • నేషనల్ గస్ గ్రిడ్ 16200 కిలోమీటర్లు పెంపు
  • భారత్ నెట్ కింద లక్ష పంచాయతీలు అనుసంధానం
  • భారత్ నెట్ కు రూ.6000 కోట్లు

2020 బడ్జెట్ ముఖ్యాంశాలు

ఇప్పటివరకూ 40 కోట్ల జీఎస్టీ రిటర్న్లు దాఖలైనట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ ప్రవేశ పెట్టిన తరువాత పన్ను విధానంలో పారదర్శకత వచ్చిందని, జీఎస్టీ స్లాబ్ ల తగ్గింపుతో సామాన్యులకు ఎంతో మేలు చేకూరుతుందని ఆమె పేర్కొన్నారు. జీఎస్టీ మండలి జీఎస్టీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందన్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్...మా లక్ష్యమన్నారు నిర్మల. ఖర్చు చేసే ప్రతి రూపాయి నిరుపేదలకు అందించేందుకే కేంద్రం కృషి చేస్తుందన్నారు. అలాగే నిర్మాణాత్మక చర్యలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. 2006 నుంచి 2016 మధ్య పేదరికం నుంచి 22 కోట్ల మంది బయటపడ్డారని తెలిపారు. అదేవిధంగా 2019లో కేంద్రంపై 48.7 శాతం మేరకు రుణభారం తగ్గిందన్నారు.

ప్రధాని ఆవాస్ యోజన ద్వారా దేశంలోని పేదలందరికీ సొంత ఇళ్లు ఇచ్చామన్నారు. బడ్జెట్ లో తొలి ప్రాధాన్యత వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధికి, రెండో ప్రాధాన్యత ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీటికి ఇచ్చారు. మూడో ప్రాధాన్యాంశంగా విద్య, చిన్నారుల సంక్షేమాన్ని బడ్జెట్ లో చేర్చారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యమని, ఈ మేరకు త్వరలోనే కౌలు రైతుల కోసం కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రధాని ఫసల్ బీమా ద్వారా 6.11 కోట్ల మంది రైతులకు బీమా కల్పించామన్నారు.

  • పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు కృషి.
  • గ్రామీణ కృషి సంచాయ్ యోజన ద్వారా సూక్ష్మ, సాగునీటి విధానాలకు ప్రోత్సాహం.
  • గ్రామీణ సడక్ యోజన, ఆర్థిక సమ్మిళిత విధానాలతో రైతులకు మేలు.
  • పంటల దిగుబడిని మరింతగా పెంచేందుకు కృషి.
  • వ్యవసాయ విపణులు మరింత సరళీకృతం.
  • వర్షాభావ నిధులకు అదనంగా నిధులు, సాగునీటి సౌకర్యం.
  • రైతులకు 20 లక్షల సోలార్ పంపుసెట్లు, బీడు భూముల్లో సోలార్ యూనిట్లకు పెట్టుబడి సాయం.
  • రసాయన ఎరువుల నుంచి రైతులకు విముక్తి. సేంద్రీయ ఎరువుల వాడకంపై అవగాహన.
  • భూసార పరిరక్షణకు అదనపు సాయం, సంస్కరణల అమలు.
  • రైతులకు సహాయంగా నాబార్డు నిధులతో మరిన్ని గిడ్డంగుల నిర్మాణం.
  • పీపీపీ పద్ధతిలో ఎఫ్సీఐ ఆధ్వర్యంలో గోడౌన్లను నిర్మిస్తాం.
  • పంటల కొనుగోలుకు నాబార్డు ద్వారా ఎస్ఎస్జీలకు సహాయం.
  • కూరగాయల సరఫరాకు కృషి ఉడాన్ యోజన.
  • ప్రత్యేక విమానాల ద్వారా పండ్లు, కూరగాయలు, పూల ఎగుమతులు.
  • ఉద్యాన పంటల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం.
  • కేంద్రంతో పాటు రాష్ట్రాల నుంచి కూడా ఉద్యాన పంటలకు అదనపు నిధులు.
  • ఉద్యాన పంటల కోసం ప్రత్యేక క్లస్టర్లు.
  • పాల ఉత్పత్తుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు కృషి.
  • కరవు జిల్లాల్లో రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు.
  • ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసే వారికి మరింత ప్రోత్సాహం.
  • ఆయుష్మాన్ భారత్ లో భాగంగా దేశవ్యాప్తంగా 20 వేల ఆసుపత్రుల నిర్మాణం.
  • మత్స్యకారుల కోసం నూతనంగా 3,400 'సాగర్ మిత్ర'లు.
  • ఆల్గే, సీవీ కేజ్ కల్చర్ విధానంలో మత్స్య పరిశ్రమకు ప్రోత్సాహకాలు.
  • కోస్తా ప్రాంతాల్లోని గ్రామీణ యువతకు మత్స్య పరిశ్రమలతో మరింత ఉపాధి.
  • మిషన్ ఇంద్రధనుష్ ద్వారా టీకాలు.
  • ఆరోగ్య పరిరక్షణకు స్వచ్ఛభారత్ ద్వారా కొత్త స్కీమ్ లు.
  • 'టీబీ హరేగా... దేశ్ బచేగా' పేరుతో క్షయ వ్యాధి నివారణా చర్యలు.
  • బహిరంగ మలమూత్ర విసర్జన రహిత దేశంగా అవతరిస్తున్న భారతావని.

స్టడీ ఇన్ ఇండియా, నేషనల్ పోలీస్ వర్శిటీ, నేషనల్ ఫోరెన్సిక్ వర్శిటీ

2030 నాటికి అత్యధిక యువతకు భారత్ లోనే ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. స్థానిక సంస్థల్లోనే ఇంజనీరింగ్ విద్యార్థుల అప్రెంటీస్ విధానాన్ని అమలు చేసి నిరుద్యోగ కొరత తగ్గిస్తామన్నారు. విదేశీ విద్యార్థుల కోసం స్టడీ ఇన్ ఇండియా పేరిట కొత్త కార్యక్రమం చేపట్టనున్నట్లు నిర్మలమ్మ పేర్కొన్నారు. నూతనంగా నేషనల్ పోలీస్ వర్శిటీ, నేషనల్ ఫోరెన్సిక్ వర్శిటీ లను ఏర్పాటు చేయనుంది కేంద్రం. 2026 నాటికి 150 యూనివర్శిటీల్లో కొత్త కోర్సులు ప్రవేశపెడతామన్నారు. జిల్లా ఆసుపత్రులతో మెడికల్ కాలేజీలను అనుసంధానం చేస్తామన్నారు.

  • విద్యారంగంలో విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం.
  • భూమి సౌకర్యం కల్పించే రాష్ట్రాలకు కేంద్రం నుంచి అదనపు ప్రయోజనాలు.
  • వైద్య పీజీ కోర్సుల కోసం పెద్దాసుపత్రులకు మరిన్ని ప్రోత్సాహకాలు.
  • వర్శిటీల కోసం త్వరలో జాతీయ స్థాయి విధానం.
  • ఉపాధ్యాయులు, పారా మెడికోల కొరత తీర్చేలా కొత్త విధానం.
  • ఐదు కొత్త స్మార్ట్ సిటీల అభివృద్ధి
  • ఎలక్ట్రానిక్స్ అభివృధి కొత్త పథకం
  • మొబైల్ ఫోన్ తయారీకి ప్రోత్సాహకాలు
  • నేషనల్ టెక్ టెక్స్టైల్ మిషన్

Next Story