మంత్రి బోత్స సత్యనారాయణ ఇంట విషాదం

By సుభాష్  Published on  16 Aug 2020 2:28 AM GMT
మంత్రి బోత్స సత్యనారాయణ ఇంట విషాదం

ఏపీ మంత్రి బోత్స సత్యనారాయణ ఇంటి విషాదం నెలకొంది. ఆయన తల్లి ఈశ్వరమ్మ (85) ఆదివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈశ్వరమ్మకు ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. మంత్రి బోత్స సత్యనారాయణ పెద్ద కుమారుడు కాగా, రెండో కుమారుడు బోత్స అప్పల నరసయ్య (ఎమ్మెల్యే). విజయనగరంలోని స్వర్గధామంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Next Story