'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు' ట్రైలర్ విడుదల చేసిన వరుణ్ తేజ్
By అంజి Published on 21 Nov 2019 11:46 AM GMTఫ్లయింగ్ కలర్స్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై శ్రీనివాసరెడ్డి, సత్య, షకలక శంకర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం 'భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు'. ఈ చిత్రం ద్వారా కమెడియన్ వై.శ్రీనివాస్ రెడ్డి దర్శక నిర్మాతగా మారుతున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా ట్రైలర్ను మెగ్రాప్రిన్స్ వరుణ్తేజ్ విడుదల చేశారు.
సినిమా ట్రైలర్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. సినిమా ఇంతకు మించి ఎంటర్టైనింగ్గా ఉంటుందని భావిస్తున్నాను. సినిమా చాలా పెద్ద హిట్ కావాలంటూ ఎంటైర్ యూనిట్కు అభినందనలు తెలిపారు వరుణ్తేజ్. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. డిసెంబర్ 6న సినిమాను విడుదల చేస్తున్నారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. 'జయమ్ము నిశ్చయమ్మురా' రచయిత పరం సూర్యాన్షు ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ప్లేను అందించారు.
శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్, సత్య, వెన్నెలకిషోర్, సత్యం రాజేశ్, రఘుబాబు, ప్రవీణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత, దర్శకత్వం: వై.శ్రీనివాసరెడ్డి, కథ, మాటలు, స్క్రీన్ప్లే: పరమ్ సూర్యాన్షు
మ్యూజిక్: సాకేత్ కొమండూరి, సినిమాటోగ్రఫీ: భరణి కె.ధరణ్, ఎడిటర్: అవుల వెంకటేశ్, ఆర్ట్: రఘు కులకర్ణి, లైన్ ప్రొడ్యూసర్: చిత్రం శ్రీను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ధనుంజయ కుమార్, ఎగ్జిక్యూషన్: నారాయణ జంప.