విలువిద్యలో ప్రతిభ చూపిన భారత్‌ క్రీడాకారిణులు

By Newsmeter.Network  Published on  28 Nov 2019 12:20 PM GMT
విలువిద్యలో ప్రతిభ చూపిన భారత్‌ క్రీడాకారిణులు

విలువిద్య క్రీడాకారిణులు మరోసారి మెరుపులు మెరిపించారు. విలువిద్య క్రీడాల్లో అద్భతంగా రానించారు. ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో వ్యక్తిగత రికర్వు పోటీల్లో స్వర్ణం, రజతం కైవసం చేసుకున్నారు. ఏకపక్షంగా సాగిన ఫైనల్‌ పోరులో దీపికా కూమారి6-0 తో తన తోటి క్రీడాకారిణి అనికిత భకత్‌పై విజయం సాధించింది. దీంతో బంగారం పతకాన్ని ముద్దాడింది.

అయితే ఈ క్రీడలో రన్నరప్‌గా నిలిచిన అనికతకు రజతం దక్కింది.

అయితే ఆసియా ఛాంపియన్‌షిప్స్‌ సెమీస్‌ చేరడంతోనే వీరిద్దరికి ఒలింపిక్స్‌ వ్యక్తిగత రికర్వు పోటీలకు అర్హత లభించిన విషయం తెలిసిందే. ఈమేరకు సెమీస్‌లో భుటాన్‌కు చెందిన కర్మను అనికత ఓడించింది. అలాగే వియత్నంకు చెందిన గుయెత్‌ డుతిఅన్‌ను దీపక కూమారి ఓడించింది. దీంతో విలువిద్య క్రీడల్లో భారత్‌కు ఓ స్వర్ణం, ఓ రజతం దక్కాయి.

Next Story