డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేతుల మీదుగా 'అప్పుడు-ఇప్పుడు' మూవీ టీజర్ లాంచ్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Nov 2019 12:53 PM GMT
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేతుల మీదుగా అప్పుడు-ఇప్పుడు మూవీ టీజర్ లాంచ్..!

సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా యు.కె.ఫిలింస్ బేనర్ పై తెరకెక్కుతున్న చిత్రం 'అప్పుడు-ఇప్పుడు'. ఈ చిత్రానికి ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మాత‌లుగా పనిచేశారు. అలాగే చలపతి పువ్వల దర్శకత్వం వహించారు. కాగా.. శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య ముఖ్య పాత్రల్లొ నటిస్తున్నారు.

ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. దసరా కానుక‌గా విడుద‌లైంది. కళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ చెతులుమీదుగా విడుదలైన ఈ చిత్రం మొదటి గీతానికి మంచి స్పందన వచ్చింది. అలాగే ఇటీవల దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలైన పాటకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా లేటెస్ట్ గా 'అప్పుడు-ఇప్పుడు' మూవీ టీజర్ ను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. 'టీజర్ చాలా బాగుంది. సినిమా మంచి హిట్ అవుతుంది' అని అన్నారు.

దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ...

'అప్పుడు-ఇప్పుడు' చిత్రం టీజర్ ను పూరి జగన్నాథ్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మా యూనిట్ తరుపున ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నాం అన్నారు. ఈ మూవీ ఒక ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్. హీరో హీరోయిన్లు కొత్తవారే అయినా పూర్తి సహకారం అందించారని తెలిపారు. మేకింగ్ లో ఎక్కడా రాజీప‌డ‌కుండా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించామన్నారు. తప్పకుండా ఈ చిత్రం మీ అందరికీ నచ్చుతుంది అని అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ...

పూరి జగన్నాథ్ గారు మా టీజర్ ను రిలీజ్ చేయడం హ్యాపీగా ఉందన్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. ఇప్పుడు టీజర్ తో ఇటు అభిమానుల్లో అటు ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్ ఏర్పడిందన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటుందని.. నిర్మాతలు ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు అన్నారు. అలాగే త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తాం అని అన్నారు.

Next Story