ఏపీలో మ‌రో 57 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 May 2020 5:43 AM GMT
ఏపీలో మ‌రో 57 కేసులు

ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 9,739 సాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా.. 57 మందికి క‌రోనా పాజిటివ్‌గా వ‌చ్చిన‌ట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2339 కి చేరింది. 69 మంది కరోనా వైరస్ వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు 1596 మంది డిశ్చార్జి కాగా.. 691 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. మ‌రో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మ‌ర‌ణించిన వారి సంఖ్య 52 కి చేరింది. గ‌త 24 గంట‌ల్లో క‌ర్నూలు జిల్లాలో ఒక‌రు, చిత్తూరు జిల్లాలో మ‌రోక‌రు మ‌ర‌ణించారు.

కోయంబేడు మార్కెట్ నుంచి వ‌చ్చిన వారిలో ఆరుగురికి క‌రోనా పాజిటివ్ ఉన్న‌ట్లు తేలింది. వారిలో ఐదుగురు చిత్తూరు జిల్లాకు చెందిన వారు కాగా.. ఒక‌రు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన వారు.



Next Story