అలాంటి వాళ్లకు YSR ఆశయాలు గుర్తుకు ఉంటాయని అనుకోవడం పొరపాటు : జ‌గ‌న్‌పై ష‌ర్మిల విమ‌ర్శ‌లు

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం YSR మానస పుత్రిక.. మహానేత హయాంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఒక ప్రతిష్ఠాత్మక పథకం అని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు

By Medi Samrat  Published on  21 Oct 2024 12:04 PM GMT
అలాంటి వాళ్లకు YSR ఆశయాలు గుర్తుకు ఉంటాయని అనుకోవడం పొరపాటు : జ‌గ‌న్‌పై ష‌ర్మిల విమ‌ర్శ‌లు

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం YSR మానస పుత్రిక.. మహానేత హయాంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఒక ప్రతిష్ఠాత్మక పథకం అని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. పేద బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపి, ఎంతో మంది ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేసిన గొప్ప పథకం అని కొనియాడారు. నాడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని YSR అద్భుతంగా అమలు చేస్తే.. సొంత కొడుకై ఉండి జగన్ మోహన్ రెడ్డి తన హయాంలో పథకాన్ని నీరు గార్చారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు రూ.3500 కోట్లు పెండింగ్ పెట్టడం నిజంగా సిగ్గుచేటు అని విమ‌ర్శించారు. బకాయిలు చెల్లించకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడారని.. తల్లిదండ్రులను మనోవేదనకు గురి చేశారన్నారు. దోచుకొని దాచుకోవడం మీద ఉన్న శ్రద్ధ, విద్యార్థుల సంక్షేమం మీద పెట్టలేదన్నారు.

YSR తన జీవితం మొత్తం మత పిచ్చి బీజేపీనీ వ్యతిరేకిస్తే.. అదే బీజేపీకి జగన్ ఇప్పుడు దత్తపుత్రుడు. బీజేపీతో చెట్టా పట్టాలు వేసుకొని తిరిగిన మోడీ వారసుడు జగన్.. అలాంటి వాళ్లకు YSR ఆశయాలు గుర్తుకు ఉంటాయని అనుకోవడం.. ఆశయాలకు వారసులు అవుతారనడం పొరపాటు అన్నారు.

నాడు YCP ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చి నిర్వీర్యం చేయాలని చూస్తే.. నేడు కూటమి ప్రభుత్వంనిర్లక్ష్యం చేస్తోందన్నారు. వైసీపీ చేసింది మహా పాపమైతే.. కూటమి సర్కారు విద్యార్థులకు పెడుతున్నది శాపం అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో చంద్ర‌బాబును డిమాండ్ చేస్తున్నాం. బకాయిలు ఎవరు పెండింగ్ పెట్టినా.. అవి రిలీజ్ చేసే బాధ్యత ఇప్పుడు మీపై ఉంది. వెంటనే నిధులు విడుదల చేయాలని, పథకానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.

Next Story