ర‌థోత్స‌వంలో అప‌శ్రుతి.. విద్యుత్ షాక్‌తో ఇద్ద‌రు మృతి

Two people died with electricshock in chintalamuni chariot festival.క‌ర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆధోని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Aug 2021 7:24 AM GMT
ర‌థోత్స‌వంలో అప‌శ్రుతి.. విద్యుత్ షాక్‌తో ఇద్ద‌రు మృతి

క‌ర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆధోని మండ‌లం పెస‌ల‌బండ‌లో నిర్వ‌హించిన మునిస్వామి ర‌థోత్స‌వంలో అప‌శ్రుతి చోటుచేసుకుంది. ర‌థోత్స‌వంలో పాల్గొన్న ఇద్ద‌రు భ‌క్తులు విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. మ‌రో 8 మంది భ‌క్తుల‌కు గాయాల‌య్యాయి. బుధ‌వారం ఉద‌యం ర‌థోత్స‌వం నిర్వ‌హిస్తుండ‌గా.. ర‌థానికి విద్యుత్ తీగ‌లు త‌గితాయి.

దీంతో విద్యుత్ షాక్‌కు గురై ఇద్ద‌రు వ్య‌క్తులు అక్క‌డిక్క‌డే మృతి చెంద‌గా.. మ‌రో 8 మంది వ‌ర‌కు గాయాల‌య్యాయి. గాయ‌ప‌డిన వారిని వెంట‌నే స్థానికులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృతుల‌నే అదే గ్రామానికి చెందిన వీరాంజ‌నేయులు, వెంక‌టేశులుగా గుర్తించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు.

Next Story