నిశ్చితార్థం జరిగిన 4 రోజులకే విషాదం.. చెరువులో మునిగి యువకుడి మృతి

కాకినాడ జిల్లా సామర్లకోటలోని భీమేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఉన్న చెరువులో మునిగి వెన్నెల ప్రశాంత్ (24) అనే యువకుడు గురువారం మృతి చెందాడు

By -  అంజి
Published on : 20 March 2026 8:23 AM IST

Kakinada District News,Samalkot Drowning Incident, Vennela Prashanth Death, Bhimeswara Swamy Temple Pond, Ugadi Festival Tragedy, Engagement Aftermath

నిశ్చితార్థం జరిగిన 4 రోజులకే విషాదం.. చెరువులో మునిగి యువకుడి మృతి

కాకినాడ జిల్లా సామర్లకోటలోని భీమేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఉన్న చెరువులో మునిగి వెన్నెల ప్రశాంత్ (24) అనే యువకుడు గురువారం మృతి చెందాడు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రశాంత్ తన స్నేహితుడితో కలిసి స్వామివారి దర్శనం కోసం ఆలయానికి వెళ్లాడు. ఈ క్రమంలో చెరువులోకి దిగేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయాడు.

సామర్లకోట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎ. కృష్ణ భగవాన్ తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు ప్రశాంత్‌కు కేవలం నాలుగు రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది. పెళ్లి కళతో కళకళలాడాల్సిన ఇంట్లో ఈ అకాల మరణం తీరని శోకాన్ని నింపింది. ప్రశాంత్ నీటిలో పడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story