జాతీయ స్థాయిలో ఏపీకి మరోసారి అవార్డుల పంట

Swachh Bharat Awards .. ఏపీకి జతీయ స్థాయిలో అవార్డులు దక్కాయి. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అవార్డులను

By సుభాష్  Published on  20 Nov 2020 9:50 AM GMT
జాతీయ స్థాయిలో ఏపీకి మరోసారి అవార్డుల పంట

ఏపీకి జతీయ స్థాయిలో అవార్డులు దక్కాయి. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అవార్డులను ప్రకటించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఈ జాతీయ అవార్డులను దక్కించుకున్నాయి. స్వచ్ఛభారత్ మిషన్‌ ద్వారా ఏపీలో చేపట్టిన కార్యక్రమాలకు ఈ అవార్డులు వరించాయి.

ఓడీఎఫ్‌, జీరో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, నూతన టెక్నాలజీలకు అవార్డులు దక్కాయి. తూర్పు, పశ్చిమగోదావరి కలెక్టర్లకు అవార్డులను కేంద్ర మంత్రి షెకావత్‌ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ఎండీ సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారానే ఇది సాధ్యమైందని తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థతో నిర్వహణ సులభతరమైందని పేర్కొన్నారు.

Next Story