ఏపీ హైకోర్టు నూత‌న న్యాయమూర్తులుగా ఏడుగురు ప్రమాణస్వీకారం

Seven new judges of AP High Court sworn in.ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు నూత‌న న్యాయ‌మూర్తులుగా ఏడుగురు ప్ర‌మాణ‌స్వీకారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Aug 2022 6:42 AM GMT
ఏపీ హైకోర్టు నూత‌న న్యాయమూర్తులుగా ఏడుగురు ప్రమాణస్వీకారం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు నూత‌న న్యాయ‌మూర్తులుగా ఏడుగురు ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. గురువారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ వారిచే ప్రమాణం చేయించారు.

న్యాయమూర్తులుగా అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు, డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యాంసుందర్, ఊటుకూరు శ్రీనివాస్,బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు , దుప్పల వెంకటరమణ ప్ర‌మాణ స్వీకారం చేశారు. వాస్త‌వానికి కొత్త న్యాయమూర్తులతో సీజే ప్రమాణం చేయించడం ఆనవాయితీ. అయితే.. సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాకు మాతృవియోగం కలగడంతో ఆయన రాలేని ప‌రిస్థితి ఉంది. దీంతో గవర్నర్‌ కొత్త న్యాయమూర్తులతో ప్రమాణం చేయించారు. అనంత‌రం గ‌వ‌ర్న‌ర్ వారికి అభినంద‌న‌లు తెలిపారు.

Next Story