Vizag: బయటపడుతున్న స్వామి పూర్ణానంద బాగోతాలు

తన ఆశ్రమంలో 15 ఏళ్ల అనాథ బాలికపై పలుమార్లు అత్యాచారం చేసి చిత్రహింసలకు గురిచేసిన 60 ఏళ్ల వృద్ధుడి కేసులో సంచలన

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Jun 2023 8:03 AM GMT
Vizag Seer, Vizag ashram, sexual abuse

Vizag: బయటపడుతున్న స్వామి పూర్ణానంద బాగోతాలు

విశాఖపట్నం: తన ఆశ్రమంలో 15 ఏళ్ల అనాథ బాలికపై పలుమార్లు అత్యాచారం చేసి చిత్రహింసలకు గురిచేసిన 60 ఏళ్ల వృద్ధుడి కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.

విశాఖపట్నంలోని జ్ఞానానంద ఆశ్రమంలో మొత్తం 12 మంది పిల్లలు ఉన్నారు. అందులో నలుగురు అమ్మాయిలు కాగా, ఎనిమిది మంది అబ్బాయిలు ఉన్నారు. ఆశ్రమంలో అనాథాశ్రమం, వృద్ధాశ్రమం ఉన్నాయి. ఈ ఆశ్రమం 1955లో స్థాపించబడింది. దీనికి అధిపతి పూర్ణానంద సరస్వతి.

జూన్ 20న ఆశ్రమంలో బాలికపై పదేపదే అత్యాచారం చేసినందుకు విశాఖపట్నం దిశా పోలీసులు పూర్ణానంద స్వామీజిని అరెస్టు చేశారు.

పూర్ణానంద స్వామిజీపై ఐపిసి సెక్షన్లు 323, 342, 376 (2) ఎఫ్, 376 (3), పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద బోధకుడిపై కేసు నమోదు చేయబడింది. జూలై 5 వరకు రిమాండ్‌పై విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు.

ఏసీపీ (దిశా పోలీస్ స్టేషన్) సీహెచ్‌ వివేకానంద న్యూస్ మీటర్‌తో మాట్లాడుతూ.. "ఆశ్రమంలో చదువుతున్న ఇతర బాలికలు బాధితురాలి కంటే చిన్నవారు. మేము వారితో మాట్లాడినప్పుడు, ఒక అమ్మాయి తనను స్వామిజీ వేధించాడని, తాను ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్లు పేర్కొంది" అని చెప్పారు.

భోగాపురంలో ఇద్దరు పిల్లలను కలిగి ఉన్న మరొక శాఖ ఉంది. కొంతమంది పిల్లలు అనాథలు కాగా, మరికొందరు అల్పాదాయ వర్గాలకు చెందినవారు, వారి తల్లిదండ్రులు వారిని ఆహారం, విద్య కోసం అక్కడ చేర్చారు. పిల్లలందరికీ ఆశ్రమ పాఠశాలలో విద్య అందించబడుతోంది. వారు తమ భోగాపురం శాఖ ద్వారా ప్రతి సంవత్సరం పరీక్షలు రాస్తారు.

రాత్రి సమయాల్లో వేధింపులు

ఆశ్రమంలో దాదాపు 5-6 మంది కార్మికులు నివసిస్తూ ఉండేవార. స్వామిజీ రాత్రి సమయంలో బాధితురాలిని, మరొక అమ్మాయిని తన గదికి పిలిచేవాడు. తన కాళ్లను నొక్కమని చెబుతూనే వారిని లైంగికంగా వేధించేవాడు.

2016లో తల్లిదండ్రులు చనిపోవడంతో బాధితురాలు రాజమండ్రిలోని గండేపల్లి సాధుమఠంలో ఉంటోంది. అయితే ఆ తర్వాత ఆమెను పూర్ణానంద ఆశ్రమానికి తరలించారు.

"బాధితురాలు ఇతరులకన్నా పెద్దది. ఆమె నుండి స్వామీజీ లైంగిక కోరికలు తీర్చుకోవాలనుకున్నాడు. ఆమె స్వామిజీ కళ్లలో పడింది. అతను రాత్రిపూట బాధితురాలిని లైంగికంగా వేధించేవాడు. బహుశా ఇది ఎవరికీ తెలియదు. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత మేము పిల్లలందరినీ ప్రభుత్వ గృహానికి తరలించాము" అని ఏసీపీ అన్నారు.

బాధితురాలు తప్పించుకుని రైలు ఎక్కింది

సుమారు రెండేళ్లపాటు లైంగిక వేధింపులు, చిత్రహింసలకు గురైన బాధితురాలు ఆశ్రమం నుంచి తప్పించుకోగలిగింది. ''రెండేళ్లుగా ఆశ్రమంలో ఉన్నాను.. రాత్రిపూట నన్ను తన గదికి పిలిచి లైంగికంగా వేధించేవాడు. ఒకరోజు ప్రసాదం వాహనం కోసం ఆశ్రమం తలుపులు తెరిచి ఉండగా ఆశ్రమంలోని ఓ మహిళ దగ్గర కొంత డబ్బు అడిగాను. ఆ తర్వాత నేను ఆటో రిక్షా ఎక్కి నన్ను రైల్వే స్టేషన్‌కి తీసుకెళ్లమని అడిగాను" అని బాధితురాలు చెప్పింది.

రైలు ఎక్కిన తర్వాత బాలిక సహాయం కోరుతూ ఒక మహిళా ప్రయాణిరాలికి తనకు జరిగిన దొపిడీ గురించి వివరించింది. మహిళా ప్రయాణికురాలు ఆమెను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సిడబ్ల్యుసి)తో సంప్రదించింది. ఆ తర్వాత బాలిక ఆశ్రమంలో తాను ఎదుర్కొన్న కష్టాలను వెల్లడించింది.

సదరు వ్యక్తి తన బెడ్‌రూమ్‌లో గొలుసుతో బంధించేవాడని ఫిర్యాదులో పేర్కొంది. బాలిక ఫిర్యాదుతో విజయవాడలోని దిశ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి వైద్య పరీక్షల కోసం వెళ్లింది. స్వామిజీ అనుమానం రాకుండా ఉండేందుకు జూన్ 15న ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్‌లో బాలిక మిస్సింగ్ ఫిర్యాదు చేశాడు.

బాధితురాలిని విజయవాడలోని ప్రభుత్వాసుపత్రి నుంచి డిశ్చార్జి చేసి బుధవారం విజయవాడ నగరంలోని ప్రజ్వల ఇంటికి తరలించారు. మరికొద్ది రోజుల్లో బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం ఆమెను విశాఖపట్నంలోని బాలికల ప్రభుత్వ వసతి గృహానికి తరలిస్తారు.

"ఆమె వైజాగ్‌కు తిరిగి వచ్చిన తర్వాత మేము పూర్తి వివరాలను పొందుతాము. ఈ కేసులో మరింత ముందుకు వెళ్తాము" అని ఏసీపీ న్యూస్ మీటర్‌తో మాట్లాడుతూ అన్నారు.

ఇదే మొదటిసారి కాదు

తన ఆశ్రమంలో పిల్లలను దుర్భాషలాడుతూ పట్టుబడటం ఇదే మొదటిసారి కాదు. 2012లో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో అరెస్టయ్యాడు. తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. 2012 నాటి కేసు ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉంది.

తనపై ఆరోపణలు, కేసులు పెట్టి ఆశ్రమానికి చెందిన విలువైన భూమిని లాక్కోవడానికి కుట్ర పన్నారని నిందితుడు పేర్కొన్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆశ్రమానికి చెందిన దాదాపు 9.5 ఎకరాల భూమి కూడా వివాదంలో ఉంది. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటన అనంతరం వెంకోజిపాలెంలోని ఆశ్రమ భూమిని కొందరు అక్రమార్కులు కబ్జా చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారని, దీని విలువ కోట్లాది రూపాయలు ఉంటుందని స్వామిజీ శ్రీనివాస నంద సరస్వతి ఆరోపించారు.

"ఇంతకుముందు దుండగులు ఆవులను తరలించడానికి ప్రయత్నించారు. ఆశ్రమం ఖాళీ చేయమని పూర్ణానందకు హత్య బెదిరింపులు కూడా ఇచ్చారు, పోలీసులు ఈ కేసుపై న్యాయమైన విచారణ జరపాలి" అని శ్రీనివాస నంద సరస్వతి అన్నారు.

ఆశ్రమానికి షెల్టర్ హోమ్ నిర్వహించడానికి అనుమతి లేదు

చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బృందం జ్ఞానానంద ఆశ్రమాన్ని సందర్శించి పిల్లలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనాథ శరణాలయాన్ని నిర్వహించడానికి ఆశ్రమానికి ఎలాంటి అనుమతి లేదని బృందం తెలిపింది. ఆశ్రమం అధ్వాన్నంగా ఉందని, అక్కడున్నవారు అపరిశుభ్రంగా జీవిస్తున్నారని కూడా వారు చెప్పారు. ఆశ్రమంలో పిల్లలకు స్నానానికి సరిపడా ఆహారం, నీళ్లు కూడా ఇవ్వలేదు.

Next Story