నటుడు పోసానికి ఏపీ ప్రభుత్వం కీలక పదవి

Posani Krishna Murali gets appointed as AP Film Development Corporation new chairman. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా టాలీవుడ్ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణ మురళిని ఆంధ్రప్రదేశ్

By అంజి  Published on  3 Nov 2022 11:36 AM GMT
నటుడు పోసానికి ఏపీ ప్రభుత్వం కీలక పదవి

ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా టాలీవుడ్ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణ మురళిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం నియమించింది. ఈమేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పోసాని కృష్ణ మురళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరపున కూడా ప్రచారం చేశారు. సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళి చాలా కాలంగా వైఎస్ జగన్‌కు, ఆయన రాజకీయ పార్టీకి మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అతను 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ నాయకుల గెలుపు కోసం ప్రచారం చేశాడు.

ప్రముఖ నటుడు పోసాని.. సినీ రచయిత, దర్శకుడిగా పని చేశారు. దాదాపు 150 చిత్రాలకు పైగా రచయితగా పని చేశారు. నటుడిగా అతను ఈ సంవత్సరం ఇప్పటికే సినిమాల్లో కనిపించాడు. 'సూపర్ మచి', 'ఆచార్య', 'భల తందనానా', 'సర్కారు వారి పాట', 'ది వారియర్'. ఇప్పుడు రాబోయే 'హిట్: ది సెకండ్ కేస్' మూవీలో పోసాని నటించాడు. రచయితగా కెరీర్ ప్రారంభించినా నటుడిగా, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం తన ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా మరో సినీ నటుడు అలీని నియమించింది. అలీ కూడా గతంలో పార్టీకి మద్దతుదారుగా ఉన్నాడు. ఎస్సార్‌సీపీకి సేవలందించినందుకుగానూ ఈ పదవిని పొందిన అలీ రెండేళ్లపాటు ఆ పదవిలో ఉంటారు.

Next Story