అనంత‌పురం జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఎమ్మెల్యే బాల‌కృష్ణ విన‌తి ప‌త్రం

MLA Nandamuri Balakrishna meets Ananthapuram District Collector.నూతనంగా ఏర్పడే శ్రీ సత్యసాయి జిల్లాకు హిందూపురాన్ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Feb 2022 7:32 AM GMT
అనంత‌పురం జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఎమ్మెల్యే బాల‌కృష్ణ విన‌తి ప‌త్రం

నూతనంగా ఏర్పడే శ్రీ సత్యసాయి జిల్లాకు హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనంత‌పురం జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మికి విన‌తిప‌త్రాన్ని అంద‌జేశారు. అంతక‌ ముందు బాల‌కృష్ణ‌ అఖిలపక్ష నేతలతో కలిసి భారీ ర్యాలీగా హిందూపురం నుంచి అనంతపురంకు బయల్దేరారు. వందలాది వాహనాలతో ఆయన కలెక్టరేట్ కు చేరుకున్నారు. టీడీపీ నేతలు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిల‌తో క‌లిసి బాలయ్య క‌లెక్ట‌ర్‌కు విన‌తి ప‌త్రాన్ని అందించారు.

హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ బాలకృష్ణ నిన్న మౌన‌దీక్ష చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. హిందూపురం ప‌ట్ట‌ణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి భారీ ర్యాలీ నిర్వహించిన బాలకృష్ణ.. అంబేడ్కర్ విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారు. అన్ని అర్హతలున్న హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అంతేకాదు హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే రాజీనామా చేసేందుకు సిద్ద‌మ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న నేడు క‌లెక్ట‌ర్‌కు విన‌తి ప‌త్రాన్ని అందించారు.

Next Story