కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుల వల్ల తనకు ప్రాణహాని ఉందని వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ వాపోయారు. ఈ మేరకు పులివెందుల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పులివెందుల పట్టణ శివారులో నలుగురు అవినాష్ రెడ్డి అనుచరులు తమను కారులో వెంబడించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పెళ్లి రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వెళ్లి వస్తుండగా ఘటన జరిగిందని తెలిపారు.
అవినాష్ అనుచరులు తమపై దాడికి ప్రయత్నించినట్లు సునీల్ కుమార్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అవినాష్ అనుచరుల నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ డీఎస్పీకి విజ్ఞప్తి చేశాడు. 2019లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిలకు ముందు వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సునీల్ యాదవ్ను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్పై వచ్చాడు.