90 శాతం మందిని తొలగించబోతున్నట్లే..!

Jagan Reddy Preps New Cabinet.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని రద్దు చేసి, కొత్త మంత్రులను తీసుకురావడానికి

By M.S.R  Published on  7 April 2022 9:10 AM GMT
90 శాతం మందిని తొలగించబోతున్నట్లే..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని రద్దు చేసి, కొత్త మంత్రులను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. మంత్రుల పదవీకాలం రెండున్నర సంవత్సరం దాటడం.. 2024 రాష్ట్ర ఎన్నికలకు ముందు ఇదొక కీలక అడుగుగా వైసీపీ భావిస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జరిగే క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆ తర్వాత మంత్రులు తమ రాజీనామా లేఖలను సమర్పించాలని కోరనున్నట్లు సమాచారం. "పాత జట్టులో 90 శాతం మంది తొలగించబడతారు" అని ఇప్పటికే వార్తలు గుప్పుమన్నాయి.

కొత్త మంత్రి వర్గానికి సంబంధించిన మార్పు.. డిసెంబర్ 2021లో జరగాల్సి ఉంది కానీ.. మహమ్మారి కారణంగా వాయిదా వేయవలసి వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ బుధవారం సాయంత్రం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశమై తన మంత్రివర్గాన్ని పునర్నిర్మించనున్నట్లు చెప్పినట్లు సమాచారం. శుక్రవారం ఆయనతో మరోసారి సమావేశమై ఏప్రిల్ 11న ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటున్న మంత్రుల జాబితాను ఆయనకు అందజేసే అవకాశం ఉంది. ఇంతకు ముందు టీమ్‌లోని ఒకరిద్దరు మంత్రులను మాత్రమే కొనసాగించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా ఏర్పాటైన 26 జిల్లాల నుంచి కొత్త మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉండే అవకాశం ఉంది. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులలో భాగంగా ఇంతకు ముందు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, కాపు కులాలు, ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన ఒక్కొక్కరు చొప్పున ఎంపిక చేసుకున్నారు. మంత్రివర్గంలో ముగ్గురు మహిళలు ఉన్నారు. దళిత వర్గానికి చెందిన మహిళ ఎం సుచరిత హోం మంత్రిగా ఉన్నారు.

Next Story