దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. త్వరలోనే 'ఇంద్రధనుస్సు' పథకం అమలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 'ఇంద్రధనుస్సు' అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రకటించారు.

By -  అంజి
Published on : 5 March 2026 10:16 AM IST

Indradhanussu Scheme AP, Free Bus Travel for PwDs, APSRTC Disability Concession, CM Chandrababu Naidu Welfare Schemes

దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. త్వరలోనే 'ఇంద్రధనుస్సు' పథకం అమలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 'ఇంద్రధనుస్సు' అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన దివ్యాంగులు ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించనున్నారు. 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. దివ్యాంగుల హక్కుల చట్టం (RPwD Act), 2016 లోని సెక్షన్ 2 (ZC) పరిధిలోకి వచ్చే వారందరికీ ఈ ఉచిత ప్రయాణ సదుపాయం వర్తిస్తుంది.

ఏపీఎస్ ఆర్టీసీ నడుపుతున్న సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించవచ్చు. దివ్యాంగులతో పాటు ప్రయాణించే సహాయకులకు కూడా ప్రభుత్వం ఊరటనిచ్చింది. పైన పేర్కొన్న బస్సు సర్వీసుల్లో తోడుగా వచ్చే వారికి బస్సు ఛార్జీలో 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకాన్ని మార్చి 18వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రారంభించనున్నారు.

ఆ రోజు నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉచిత ప్రయాణ సదుపాయం అమలులోకి వస్తుంది. దివ్యాంగుల చలనశీలతను (Mobility) పెంచడం, వారు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను సులభంగా పొందేలా చేయడమే ఈ 'ఇంద్రధనుస్సు' ప్రధాన ఉద్దేశం. సమాజంలో వారిని భాగస్వాములను చేస్తూ, గౌరవప్రదమైన ప్రజా రవాణా సేవలను అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

Next Story