ఆనందయ్య కరోనా మందు.. నేడు కృష్ణపట్నంకు ఐసీఎంఆర్ బృందం
ICMR team coming to Krishnapatnam today.కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య కరోనా నివారణకు తయారు చేసిన ఆయుర్వేద మందును పరిశీలించేందుకు ఐసీఎంఆర్ బృందం సోమవారం రానుంది.
By తోట వంశీ కుమార్ Published on
24 May 2021 5:00 AM GMT

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య కరోనా నివారణకు తయారు చేసిన ఆయుర్వేద మందును పరిశీలించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) బృందం సోమవారం రానుంది. ఈ మందులో శాస్త్రీయత నిర్ధారించి, మరింత విస్తృతం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి జగన్ ఆ మందును పరిశీలించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఐసీఎంఆర్ను కోరారు. దీంతో నేడు ఐసీఎంఆర్ బృందం కృష్ణపట్నం రానుంది.
ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆయుష్ కమిషనర్, ఆయుర్వేద వైద్య నిపుణులు మందు నమూనాలు సేకరించారు. ఈ మందు వల్ల ఎటువంటి నష్టం ఉండదని ప్రాథమికంగా నిర్ణయించారు. దీన్ని పసరు మందుగానే గుర్తిస్తామని, ఆయుర్వేద మందు అనలేమని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ బృందం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఐసీఎంఆర్ ఎలాంటి నివేదిక ఇస్తుందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది.
Next Story