నంద్యాలలో భక్తులపై తేనెటీగలు దాడి, వీఆర్వో మృతి

నల్లమల అటవీ ప్రాంతంలోని దంతాల లింగమయ్య ఆలయంలో మంగళవారం భక్తులపై తేనెటీగల గుంపు దాడి

By అంజి  Published on  17 May 2023 3:00 AM GMT
Honeybees attack, devotees, VRO died, Nandyal

నంద్యాలలో భక్తులపై తేనెటీగలు దాడి, వీఆర్వో మృతి

కర్నూలు : నల్లమల అటవీ ప్రాంతంలోని దంతాల లింగమయ్య ఆలయంలో మంగళవారం భక్తులపై తేనెటీగల గుంపు దాడి చేయడంతో ఒకరు మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన నంద్యాల జిల్లా కొత్తపల్లె మండలం పాతమడుగుల గ్రామ శివారులో చోటుచేసుకుంది. గోస్పాడు మండలం జిల్లెళ్ల గ్రామానికి చెందిన విశ్రాంత గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) శివశంకర్‌రెడ్డి (65) మృతి చెందారు.

ప్రాతకోట గ్రామస్తులు నిర్వహించిన దంతాల లింగమయ్య ఆలయంలో సుమారు 60 మంది భక్తులు మతపరమైన ఆచారాలలో పాల్గొంటున్నట్లు నివేదికలు తెలిపాయి.

తేనెటీగల గుంపు ఒక్కసారిగా మీదకు రావడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. గాయపడిన వారిని మొదట ఎర్రమటం పీహెచ్‌సీకి తరలించారు. అక్కడికి చేరుకోగానే వీఆర్వో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అనంతరం క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శివశంకర్‌రెడ్డి మృతికి అసలు కారణం గుండెపోటు అని వైద్యులు ధ్రువీకరించారని ఆత్మకూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సుబ్రహ్మణ్యం తెలిపారు.

Next Story