గుంటూరు ఎంపీగా పోటీ అంటూ ప్రచారం.. తేల్చేసిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు

మాజీ టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు గుంటూరు నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారన్న వార్తలను ఖండించారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Jun 2023 7:25 AM GMT
former Indian cricketer Ambati Rayudu, Lok Sabha poll, political entry, Guntur

గుంటూరు ఎంపీగా పోటీ అంటూ ప్రచారం.. తేల్చేసిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు

గుంటూరు: ఊహాగానాలకు తెరదించుతూ, భారత మాజీ వన్డే స్పెషలిస్ట్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు గుంటూరు నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారన్న వార్తలను ఖండించారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనపై రాయుడు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఐపీఎల్ 2023 తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో పర్యటించాడు. ఆలయాన్ని సందర్శించిన ఆయన అనంతరం పాఠశాల విద్యార్థులను కలిశారు.

విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసినప్పటి నుంచి రాయుడు రాజకీయాల్లోకి వస్తాడనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌కు ముందు ఆయనను కలిశారు, ఇది ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై పుకార్లు పుట్టించింది.

స్థానిక మీడియాతో రాయుడు మాట్లాడుతూ.. గతంలో జగన్ మోహన్ రెడ్డితో జరిగిన భేటీలు రాజకీయాల గురించి కాదని, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపై చర్చించామన్నారు.

గుంటూరు వాసిగా, అట్టడుగు స్థాయిలో యువతకు మరిన్ని మార్గాలను సృష్టించాలని రాయుడు ఆసక్తిగా ఉన్నాడు.

ప్రజా సేవ చేస్తా:

ఐపీఎల్ తర్వాత తాను గుంటూరులో ఉంటున్నానని, తరచూ ప్రజలను కలుస్తానని రాయుడు చెప్పాడు.

గుంటూరులోని ఓ పాఠశాలను సందర్శించిన సందర్భంగా రాయుడు మాట్లాడుతూ.. ప్రజాసేవ చేస్తాను.. ఎలా, ఎక్కడ అనేది త్వరలో ప్రకటిస్తామన్నారు.

గుంటూరుకు చెందిన రాయుడు ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అంబటి రాంబాబుకు దూరపు బంధువు. ఆయన కాపు సామాజికవర్గం నుంచి వచ్చారు. కొణిదెల చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రముఖ నటులు రాజకీయాల్లోకి వచ్చారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనపై రాయుడు ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Next Story