ఏపీలో టెన్త్ విద్యార్థుల మార్కుల కేటాయింపుపై కసరత్తు

Exercise on allocation of marks of tenth class students in AP.క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌దో

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 10 July 2021 12:27 PM IST

ఏపీలో టెన్త్ విద్యార్థుల మార్కుల కేటాయింపుపై కసరత్తు

క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి పరీక్ష‌ల‌ను ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. విద్యార్థుల‌కు గ్రేడ్ల‌ను కెటాయించేందుకు ఛాయ‌ర‌త‌న్ ఆధ్వ‌ర్యంలో ఓ క‌మిటీని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా.. విద్యార్థుల‌కు ఏ విధానంలో గ్రేడ్లు ఇవ్వాల‌న్న దానిపై ఛాయ‌ర‌త‌న్ క‌మిటీ చేసిన క‌స‌ర‌త్తు తుది ద‌శ‌కు చేరుకుంది. ఫార్మెటివ్ మార్కుల ఆధారంగా విద్యార్థుల‌కు గ్రేడ్లు ఇవ్వాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

పదో తరగతి విద్యార్థులకు అధికారులు రెండు ఫార్మెటివ్ పరీక్షలను నిర్వహించారు. అయితే ఫార్మెటివ్ 1 పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన 3 సబ్జెక్టులను తీసుకుని ఆ మార్కుల యావరేజ్ లెక్కిస్తారు. ఇలానే ఫార్మెటివ్ 2కు సైతం చేస్తారు. ఉదాహరణకు 50 మార్కులకు నిర్వహించిన ఫార్మెటివ్ – 1 పరీక్షలో ఓ విద్యార్థికి సరాసరి మార్కులు 35, ఫార్మెటివ్ – 2 పరీక్షలో 40 మార్కులు వస్తే మొత్తం కలిపి 75 మార్కులుగా పరిగణలోకి తీసుకుంటారు.

ఈ మార్కుల ఆధారంగా ఆ విద్యార్థికి సబ్జెక్ట్ గ్రేడ్, మొత్తం గ్రేడ్ ఇవ్వనున్నారు. అయితే ఇంటర్నల్ మార్కుల విధానం అమలులోకి రావడానికి సర్కార్ జీఓ జారీ చేయాల్సి ఉంది. ఇక దీనిపై రెండు రోజుల్లో అధికారిక ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది.

Next Story