బీజేపీ నేత, ఎంపీ జీవీఎల్ కు ట్విట్టర్ లో క్లాస్ తీసుకున్న కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి

Ex Union Minister Purandeswari. దివంగత నందమూరి తారకరామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలను ఉద్దేశించి బీజేపీ నేత

By M.S.R  Published on  17 Feb 2023 10:30 AM GMT
బీజేపీ నేత, ఎంపీ జీవీఎల్ కు ట్విట్టర్ లో క్లాస్ తీసుకున్న కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి

దివంగత నందమూరి తారకరామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలను ఉద్దేశించి బీజేపీ నేత, ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి తీవ్రంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ‘అన్నీ ఇద్దరి పేర్లేనా’ అంటూ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలపై పురందేశ్వరి స్పందించారు. ‘‘ఒకరు తెలుగు జాతికి గుర్తింపు తీసుకొని వచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం అందించారు. 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివి ప్రజలకు అందించారు. మరొకరు ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు, ఆరోగ్యశ్రీ అందించారు’’ అంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ‘‘ఆ ఇద్దరు కాదు.. ఆ మహానుభావులు’’ అని మరో ట్వీట్ చేశారు.

రాష్ట్రంలో చాలా కాలంగా అన్నింటికీ ఆ ఇద్దరి పేర్లే కనిపిస్తున్నాయంటూ ఎన్టీఆర్, వైఎస్సార్ లను ఉద్దేశించి జీవీఎల్ వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్రంలో రాజకీయాలు.. కేవలం రెండు పార్టీలకో, కుటుంబాలకో పరిమితం కాదు. ఏది చూసినా ఆ కుటుంబం.. లేదా ఈ కుటుంబం. ఆ పార్టీ.. ఈ పార్టీ. అన్నీ ఇద్దరి పేర్లేనా? మిగతా నాయకులెవరూ కనిపించరా?’’ అని ప్రశ్నించారు.


Next Story