30 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఫుడ్‌ పాయిజనా.. గ్యాస్‌ లీకా.?

As many as 40 students of Kakinada's Valasapakala KV fell ill in a suspicious incident. ఆంధ్రప్రదేశ్‌ కాకినాడలోని వలసపాకల పంచాయతీ పరిధిలో గల కేంద్రీయ విద్యాలయ పాఠశాలలోని 40 మంది విద్యార్థులు 5, 6వ తరగతి

By అంజి  Published on  6 Sep 2022 10:58 AM GMT
30 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఫుడ్‌ పాయిజనా.. గ్యాస్‌ లీకా.?

ఆంధ్రప్రదేశ్‌ కాకినాడలోని వలసపాకల పంచాయతీ పరిధిలో గల కేంద్రీయ విద్యాలయ పాఠశాలలోని 40 మంది విద్యార్థులు 5, 6వ తరగతి గదుల్లో ఊపిరాడక స్పృహతప్పి పడిపోయారు. అప్పటి వరకు యాక్టివ్‌గా ఉన్నవారంతా ఒక్కసారి అస్వస్థతకు గురయ్యారు. వీరిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తమ పిల్లలకు ఏమైందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతుండగా అస్వస్థతకు గల కారణాలను ఉపాధ్యాయులు, విద్యార్థులు స్పష్టంగా వివరించలేకపోతున్నారు. సుమారు 30 మంది విద్యార్థినులు కళ్లు తిరిగి పడిపోయారు. ఈ ఘటన వెనుక కారణం ఇంకా తెలియాల్సి ఉంది.

"రెండో పీరియడ్ తర్వాత, కొంత మంది విద్యార్థులు తరగతి గదిలో పడుకున్నారు. అకస్మాత్తుగా వారిలో కొంతమంది స్పృహ తప్పి పడిపోయారు. కొంతమందికి ఛాతీ నొప్పి, కడుపు నొప్పి, వికారం వచ్చాయి" అని సంఘటన స్థలంలో ఉన్న 5వ తరగతి విద్యార్థి చెప్పారు.

5వ తరగతి చదువుతున్న కొడుకు రాజా రమేష్‌ తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. ''మా అబ్బాయి అపస్మారక స్థితిలో పడిపోయాడని స్కూల్ టీచర్ నుంచి మాకు ఫోన్ వచ్చింది. నేను స్కూల్‌కి చేరుకునేసరికి 15-20 మంది విద్యార్థులు అనారోగ్యంతో కూర్చొని క్యాంపస్ ప్రాంగణంలో కూర్చున్నట్లు చూశాను. మేము వెంటనే వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాము. కారణం మాకు ఇంకా తెలియలేదు."

గ్యాస్ లీక్‌గా అనుమానిస్తున్నారు

పాఠశాల వెనుక ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉంది. ఇది విష వాయువులను విడుదల చేస్తుంది. ఫ్యాక్టరీ నుంచి అమ్మోనియా గ్యాస్ లీకైనట్లు అనుమానిస్తున్నారు. అలాగే స్కూల్ లేబొరేటరీ నుంచి గ్యాస్ లీక్ అయిందని అధికారులు అనుమానిస్తున్నారు. "కొంతమంది విద్యార్థులు తమకు గ్యాస్ వాసన వస్తోందని, దీంతో ఊపిరాడకుండా పోయిందని చెప్పారు. వెంటనే ఇతర విద్యార్థులు మాస్క్‌లు ధరించారు. క్లారిటీ లేనందున కారణం ఇంకా తెలియాల్సి ఉంది" అని ఒక విద్యార్థి తెలిపారు.

ఫుడ్ పాయిజన్ అని అనుమానిస్తున్నారు

కొంతమంది విద్యార్థులను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించి, అనంతరం జీజీహెచ్‌కు తరలించారు. ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని పీహెచ్‌సీ వైద్యుడు అనుమానం వ్యక్తం చేశారు. పుట్టినరోజు జరుపుకుంటున్న ఓ విద్యార్థి ఇచ్చిన చాక్లెట్‌ను కొందరు విద్యార్థులు తిన్నారని చెబుతున్నారు. పాఠశాల ఆవరణలో చాక్లెట్ రేపర్లు కూడా కనిపించాయి.

అధికారులు ఏం చెబుతున్నారు?

విద్యార్థులంతా ప్రస్తుతం స్థిరంగా ఉన్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంత్రి కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో ఫోన్‌లో మాట్లాడి ఉన్నతాధికారులను సంఘటనా స్థలానికి పంపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


Next Story