బస్సుయాత్ర ద్వారా పేదవాడి విజయానికి బాటలు వేయాలి: సీఎం జగన్

ఏపీలో అధికార పార్టీ వైసీపీ 'సామాజిక సాధికార యాత్ర'ను మొదలు పెట్టింది.

By Srikanth Gundamalla  Published on  26 Oct 2023 11:37 AM GMT
ycp, bus yatra, cm jagan, tweet,

బస్సుయాత్ర ద్వారా పేదవాడి విజయానికి బాటలు వేయాలి: సీఎం జగన్

ఏపీలో అధికార పార్టీ వైసీపీ 'సామాజిక సాధికార యాత్ర'ను మొదలు పెట్టింది. అయితే.. ఈ యాత్రపై ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ తాజాగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా ఒక పోస్టు పెట్టారు. నాలుగేళ్లలో జరిగిన సామాజిక న్యాయాన్ని బస్ఉ యాత్రలో ఎలుగెత్తి చాటాలని సీఎం జగన్ ఆ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో పెత్తందారులతో యుద్ధం జరగబోతుందని.. ఆ యుద్ధంలో పేదవాడి విజయానికి బాటలు వేయాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.

వైసీపీ ప్రబుత్వంలో తన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కల్పించిన ప్రాధాన్యత రాష్ట్ర చరిత్రలోనే లేదని ట్వీట్‌లో పేర్కొన్నారు సీఎం జగన్. దేశ చరిత్రలోనూ ఎన్నడూ ఇది చూడలేదని చెప్పారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ప్రగతిని ఒక హక్కుగా మన ప్రభుత్వం వారికి అందించింది. గత 53 నెలల కాలంలో రూ. 2.38 లక్షల కోట్ల డీబీటీలో 75శాతం ఈ వర్గాలకు చేరడమే దీనికి నిదర్శనం అని సీఎం జగన్‌ తన ట్వీట్‌లో ప్రస్తావించారు. 'చట్టం చేసి నామినేటెడ్ పదవుల్లో 50శాతం ఈ వర్గాలకు ఇస్తూ పట్టం కట్టిన ప్రభుత్వంకూడా మనదే. పెత్తందారీ పోకడలున్న వ్యక్తులు, శక్తులు అడుగడుగునా అడ్డుపడ్డా ఎక్కడా వెనకడుగు వేయలేదు. రాబోయే రోజుల్లోకూడా పెత్తందారులకు, పేదలకు మధ్య యుద్ధం జరగబోతోంది. ఈరోజు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “సామాజిక సాధికార యాత్ర” ద్వారా వీరంతా ఏకమై మన ప్రభుత్వంలో జరిగిన సామాజిక న్యాయాన్ని ప్రతిధ్వనించాలి. పేదవాడి విజయానికి బాటలు వేయాలి' అని సీఎం జగన్ పేర్కొన్నారు

ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. అధికార పార్టీ ప్రజల్లో ఉన్న స్పందనను తెలుసుకునేందుకే ఈ యాత్ర మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తద్వారా వ్యూహాలను సిద్ధం చేయనునుంది. వై ఏపీ నీడ్స్‌ జగన్ అనే అంశాన్ని వైసీపీ ప్రతినిధులు సామాజిక సాధికార యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. గురువారం ప్రారంభమైన మొదటి విడత బస్సు యాత్ర నవంబర్ 9వ తేదీ వరకు కొనసాగనుంది. ఆదివారాలు మినహా రోజూ రాష్ట్రవ్యాప్తంగా 3 ప్రాంతాల్లో ప్రతిరోజూ యాత్ర ఉంటుంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఈ యాత్రను నిర్వహించనున్నారు.

వైసీపీ మొదటి విడత బస్సు యాత్ర షెడ్యూల్:

అక్టోబ‌ర్ 26 : ఇచ్చాపురం, తెనాలి, శింగ‌న‌మ‌ల‌

అక్టోబ‌ర్ 27 : గ‌జ‌ప‌తిన‌గ‌రం, న‌ర‌సాపురం, తిరుప‌తి

అక్టోబ‌ర్ 28 : భీమిలి, చీరాల, పొద్దుటూరు

అక్టోబ‌ర్ 30 : పాడేరు, దెందులూరు, ఉద‌య‌గిరి

అక్టోబ‌ర్ 31 : ఆముదాల‌వ‌ల‌స, నందిగామ, ఆదోని

న‌వంబ‌ర్ 1 : పార్వతీపురం, కొత్తపేట, క‌నిగిరి

న‌వంబ‌ర్ 2 : మాడుగుల, అవ‌నిగ‌డ్డ, చిత్తూరు

న‌వంబ‌ర్ 3 : న‌ర‌స‌న్నపేట, కాకినాడ రూర‌ల్, శ్రీకాళ‌హ‌స్తి

న‌వంబ‌ర్ 4 : శృంగ‌వ‌ర‌పుకోట, గుంటూరు ఈస్ట్, ధ‌ర్మవ‌రం

న‌వంబ‌ర్ 6 : గాజువాక, రాజ‌మండ్రి రూర‌ల్, మార్కాపురం

న‌వంబ‌ర్ 7 : రాజాం, వినుకొండ, ఆళ్లగ‌డ్డ

న‌వంబ‌ర్ 8 : సాలూరు, పాల‌కొల్లు, నెల్లూరు రూర‌ల్

న‌వంబ‌ర్ 9 : అన‌కాప‌ల్లి, పామ‌ర్రు, తంబ‌ళ్లప‌ల్లె

Next Story