ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ, ఆయుష్ (AYUSH) విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. నేషనల్ ఆయుష్ మిషన్ (NAM) ద్వారా ఈ నియామకాలు చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మొత్తం 358 పోస్టులను వివిధ కేటగిరీల్లో భర్తీ చేయనున్నారు. వీటిలో వైద్య నిపుణుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరికీ అవకాశం ఉంది.
మెడికల్ & స్పెషలిస్ట్ల విభాగంలో డాక్టర్లు, సైకియాట్రిస్ట్లు, థెరపీ & ఫిట్నెస్ విభాగంలో ఫిజియోథెరపిస్ట్లు, పంచకర్మ థెరపిస్ట్లు, యోగా ఇన్స్ట్రక్టర్లు, సపోర్టింగ్ స్టాఫ్ విభాగంలో మల్టీ పర్పస్ వర్కర్లు, స్వీపర్ల పోస్టులు ఉన్నాయి. అలాగే బోధన, బోధనేతర సిబ్బంది కొరతను తీర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.1 ఆయుర్వేద, 3 హోమియో కాలేజీల్లోని 140 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తాం అని వివరించారు.
ప్రజలకు ఆయుర్వేదం, హోమియోపతి, యోగా వంటి ప్రకృతి వైద్య విధానాలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ నియామకాలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను బలోపేతం చేయడం ఈ మిషన్ ఉద్దేశ్యం. కాగా ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు త్వరలోనే అధికారిక వెబ్సైట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అర్హత గల అభ్యర్థులు తమ సర్టిఫికేట్లను సిద్ధం చేసుకోవడం మంచిది.