ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురు ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా నలుగురు జడ్జిలు ప్రమాణస్వీకారం చేశారు.

By Srikanth Gundamalla  Published on  21 Oct 2023 7:00 AM GMT
ap high court, new judges, swearing,

 ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురు ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా నలుగురు జడ్జిలు ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం విజయవాడోలని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం ఘనంగా జరిగింది. కొత్త న్యాయమూర్తులతో ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌తో పాటు న్యాయమూర్తులు, సీఎం జగన్, నూతన న్యామూర్తుల కుటుంబ సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన హరినాథ్‌ నూనెపల్లి, కిరణ్మయి మండవ, సుమతి జగడం, న్యాపతి విజయ్‌ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. న్యాయవాదుల కోటా నుంచి ఈ నలుగురిని న్యాయమూర్తులుగా నియమించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. కేంద్ర న్యాయశాఖ వీరి నియామకానికి అక్టోబర్ 18వ తేదీన ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల పోస్టులకు గానూ ప్రస్తుతం 27 మంది పని చేస్తున్నారు. వీరిలో ఇద్దరు ఇతర రాష్ట్రాలకు బదిలీ కాగా, కర్ణాటక నుంచి జస్టిస్‌ నరేందర్‌ బదిలీపై ఏపీ హైకోర్టుకు వస్తున్నారు. కొత్తగా నియమితులైన నలుగురితో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది.

Next Story