ఏపీలో స్వ‌ల్పంగా పెరిగిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..?

8239 New corona cases reported in ap.ఏపీలో నిన్న‌టితో పోలిస్తే నేడు క‌రోనా కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి. గ‌డిచిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jun 2021 2:24 PM GMT
ఏపీలో స్వ‌ల్పంగా పెరిగిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..?

ఏపీలో నిన్న‌టితో పోలిస్తే నేడు క‌రోనా కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,01,863 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 8,239 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్ర‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 17,96,122కి చేరింది. నిన్న 11,135 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 16,88 ,198 కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో ప‌ది మంది, ప్ర‌కాశంలో ఏడుగురు, శ్రీకాకుళంలో ఏడుగురు, ప‌శ్చిమ‌గోదావ‌రిలో ఏడుగురు, విశాఖ‌ప‌ట్నంలో ఆరుగురు, అనంత‌పూర్‌లో ఐదుగురు, తూర్పుగోదావ‌రిలో ఐదుగురు, క‌డ‌ప‌లో న‌లుగురు, కృష్ణ‌లో న‌లుగురు, గుంటూరులో ఇద్ద‌రు, క‌ర్నూల్‌లో ఇద్ద‌రు, నెల్లూరులో ఇద్ద‌రు చొప్పున మొత్తం 61 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 11,135కి చేరింది. ఇక రాష్ట్రంలో 96,100 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,02,39,490 సాంపిల్స్ ని పరీక్షించారు.

Next Story