ఏపీ క‌రోనా బులిటెన్ విడుద‌ల‌.. భారీగా పెరిగిన మ‌ర‌ణాలు

5963 New Corona Cases Reported In AP. ఆంధ్రప్రదేశ్‌లో గ‌డిచిన‌ 24 గంటల్లో 37,765 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 5,963 కేసులు నిర్ధ‌రాణ అయ్యాయి.

By Medi Samrat  Published on  19 April 2021 12:23 PM GMT
AP Corona cases

ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి క‌రాళ నృత్యం చేస్తోంది. గ‌త కొద్ది రోజులుగా ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. గ‌డిచిన‌ 24 గంటల్లో 37,765 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 5,963 కేసులు నిర్ధ‌రాణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన‌ పాజ‌టివ్ కేసుల సంఖ్య 9,68,000కు చేరింది. అత్య‌ధికంగా చిత్తూరు జిల్లాలో 1182 కేసులు న‌మోదు కాగా.. అత్య‌ల్పంగా ప‌శ్చిమ గోదావ‌రి, విజ‌య‌న‌గ‌రంలో 18 కేసులు చొప్పున‌ న‌మోదు అయ్యాయి.

నిన్న ఒక్క రోజే కృష్ణా జిల్లాలో ఆరుగురు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో న‌లుగురు చొప్పున, క‌ర్నూల్‌, గుంటూరు, క‌డ‌ప‌, ప్ర‌కాశం, శ్రీకాకుళం, విశాఖ‌ప‌ట్నం జిల్లాల‌లో ఇద్ద‌రు చొప్పున‌, అనంత‌పురం జిల్లాలో ఒక‌రు చొప్పున మొత్తం 27 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,437కి చేరింది. నిన్న ఒక్క రోజే 2,569మంది క‌రోనా నుంచి కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 9,12,510కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 48,053 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,57,15,757 శాంపిల్స్ ను పరీక్షించారు.




Next Story