ఏపీ క‌రోనా అప్‌డేట్‌.. స్వ‌ల్పంగా పెరిగిన కేసులు

557 New corona cases reported in AP.ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వ‌ల్పంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Oct 2021 11:01 AM GMT
ఏపీ క‌రోనా అప్‌డేట్‌.. స్వ‌ల్పంగా పెరిగిన కేసులు

ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వ‌ల్పంగా కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 40,350 పరీక్షలు నిర్వహించగా.. 557 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు గురువారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,59,122కి చేరింది. నిన్న క‌రోనా వ‌ల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,286కి చేరింది. 24 గంటల వ్యవధిలో 557 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,38,248కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,588 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,88,79,945 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

Next Story