ఏపీలో పెరిగిన కరోనా కేసులు.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

4981New corona cases Reported in AP.నిన్న‌టితో పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jun 2021 11:36 AM GMT
ఏపీలో పెరిగిన కరోనా కేసులు.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

నిన్న‌టితో పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 88,622 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 4,981 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 18,67,017కి చేరింది. నిన్న 6,464 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,04,844కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో ప‌ది మంది, తూర్పుగోదావ‌రిలో ఐదుగురు, కృష్ణ‌లో ఐదుగురు, గుంటూరులో న‌లుగురు, నెల్లూరులో న‌లుగురు, శ్రీకాకుళంలో ముగ్గురు, ప‌శ్చిమ‌గోదావ‌రిలో ముగ్గురు, అనంత‌పూర్‌లో ఒక్క‌రు, క‌డ‌ప‌లో ఒక్క‌రు, విశాఖ‌ప‌ట్నంలో ఒక్క‌రు, విశాఖ‌ప‌ట్నంలో ఒక్క‌రు చొప్పున మొత్తం 38 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12,490కి చేరింది. ఇక రాష్ట్రంలో 49,683 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,14,49,636 సాంపిల్స్ ని పరీక్షించారు.

Next Story