గత 18 నెలల్లో గిరిజన ప్రాంతాల్లో 460 కి.మీ రోడ్లు వేశాం: పవన్ కళ్యాణ్

అల్లూరి సీతారామరాజు జిల్లాలో శనివారం ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పర్యటించారు. ప్రధానమంత్రి జన్-మన్ (PM JANMAN) పథకంలో భాగంగా...

By -  అంజి
Published on : 15 March 2026 7:27 AM IST

Pawan Kalyan ASR District Visit, PM JANMAN Scheme Andhra Pradesh, Tribal Area Roads Development, G.O. No. 3 Restoration, Andhra Pradesh NDA Government, Onuru to Nandigaruvu Road, Tribal Welfare AP

గత 18 నెలల్లో గిరిజన ప్రాంతాల్లో 460 కి.మీ రోడ్లు వేశాం: పవన్ కళ్యాణ్

అల్లూరి సీతారామరాజు జిల్లాలో శనివారం ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పర్యటించారు. ప్రధానమంత్రి జన్-మన్ (PM JANMAN) పథకంలో భాగంగా ఓనూరు జంక్షన్ నుండి నందిగరువు జంక్షన్ వరకు నూతనంగా నిర్మించిన 2.4 కిలోమీటర్ల రోడ్డును ఆయన స్వయంగా తనిఖీ చేశారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఈ సందర్భంగా ఆయన నొక్కి చెప్పారు. గత 18 నెలల కాలంలో ఎన్డీయే (NDA) ప్రభుత్వం గిరిజన గూడాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు 460 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి గట్టి చర్యలు తీసుకుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

కొండ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలకు కూడా రోడ్డు కనెక్టివిటీ కల్పించడం ద్వారా గిరిజనుల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజల కష్టాలను తీర్చే 'ప్రజల ప్రభుత్వం' అని ఆయన అభివర్ణించారు. గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి అత్యంత కీలకమైన జి.ఓ నంబర్ 3 (G.O. No. 3) పునరుద్ధరణ అంశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, సానుకూల నిర్ణయం వచ్చేలా కృషి చేస్తానని గిరిజన బిడ్డలకు హామీ ఇచ్చారు.

Next Story