ఏపీలో భారీగా పెరిగిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..

3620 Covid 19 New corona cases reported in AP.నిన్న‌టితో పోలిస్తే నేడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Jun 2021 11:39 AM GMT
ఏపీలో భారీగా పెరిగిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..

నిన్న‌టితో పోలిస్తే నేడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు భారీగానే పెరిగాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 91,231 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 3,620 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగ‌ళ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 18,85,716కి చేరింది. నిన్న 5,757 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,32,971కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూరులో ఏడుగురు, కృష్ణ‌లో ఆరుగురు, తూర్పుగోదావ‌రిలో ఐదుగురు, ప్ర‌కాశంలో ఐదుగురు, గుంటూరులో న‌లుగురు, ప‌శ్చిమ‌గోదావ‌రిలో న‌లుగురు, శ్రీకాకుళంలో ముగ్గురు, అనంత‌పూర్‌లో ఇద్ద‌రు, విశాఖ‌ప‌ట్నంలో ఇద్ద‌రు, క‌ర్నూల్‌లో ఒక్క‌రు, నెల్లూరులో ఒక్క‌రు, విజ‌య‌న‌గ‌రంలో ఒక్క‌రు చొప్పున మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12,671కి చేరింది. ఇక రాష్ట్రంలో 40,074 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,18,95,922 సాంపిల్స్ ని పరీక్షించారు.

Next Story