ఏపీలో భారీగా పెరిగిన కేసులు‌... కొత్త‌గా ఎన్నంటే..?

3309 New corona cases in ap.ఏపీలో క‌రోనా మ‌హమ్మారి విజృంభిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 31,929 క‌రోనా శాంపిళ్ల‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 April 2021 1:16 PM GMT
ఏపీలో భారీగా పెరిగిన కేసులు‌... కొత్త‌గా ఎన్నంటే..?

ఏపీలో క‌రోనా మ‌హమ్మారి విజృంభిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 31,929 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 3,309 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. అత్య‌ధికంగా చిత్తూరు జిల్లాలో 740 కేసులు న‌మోదు కాగా.. ఆత‌రువాత గుంటూరు జిల్లాలో 527, విశాఖ జిల్లాలో 391, కర్నూలు జిల్లాలో 296 పాజిటివ్ కేసులు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 9,21,906 కి చేరింది. నిన్న ఒక్క రోజే క‌రోనాతో 12మంది ప్రాణాలు కోల్పోయారు.

దీంతో ఈమ‌హ‌మ్మారి కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు మృత్యువాత ప‌డిన వారి సంఖ్య 7,291కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,053 కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 8,95,949కి చేరింది. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 1,53,65,745 న‌మూనాల‌ను ప‌రీక్షించిన‌ట్లు బులిటెన్‌లో వెల్ల‌డించారు.




Next Story