ఏపీలో కరోనా విలయం.. కొత్తగా ఎన్నికేసులంటే..?
2765 New corona cases in ap.ఏపీలోగడిచిన 24 గంటల్లో 31,892 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 2,765 పాజిటివ్ కేసులు నమోదు.
By తోట వంశీ కుమార్ Published on
9 April 2021 12:09 PM GMT

ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 31,892 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 2,765 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో వెల్లడించింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 496 కేసులు నమోదు కాగా.. ఆతరువాత గుంటూరు జిల్లాలో 490, కర్నూలు జిల్లాలో 341, విశాఖ జిల్లాలో 335, నెల్లూరు జిల్లాలో 292 పాజిటివ్ కేసులు గుర్తించారు.
దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 9,18,597 కి చేరింది. నిన్న ఒక్క రోజే కరోనాతో 11మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈమహమ్మారి కారణంగా ఇప్పటి వరకు మృత్యువాత పడిన వారి సంఖ్య 7,279కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,245 కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 8,94,896కి చేరింది. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,53,65,745 నమూనాలను పరీక్షించినట్లు బులిటెన్లో వెల్లడించారు.
Next Story