ఏపీలో క‌రోనా విజృంభ‌ణ.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

2558 New corona cases in ap.ఏపీలో గ‌డిచిన 24 గంట‌ల్లో 31,268 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 2,558 పాజిటివ్ కేసులు న‌మోదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 April 2021 12:19 PM GMT
AP Corona cases

ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 31,268 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 2,558 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. అత్య‌ధికంగా చిత్తూరు జిల్లాలో 465 కేసులు న‌మోదు కాగా.. ఆత‌రువాత గుంటూరు జిల్లాలో 399, కర్నూలు జిల్లాలో 344, విశాఖ జిల్లాలో 290, నెల్లూరు జిల్లాలో 204 పాజిటివ్ కేసులు గుర్తించారు.

దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 9,15,832 కి చేరింది. నిన్న ఒక్క రోజే క‌రోనాతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈమ‌హ‌మ్మారి కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు మృత్యువాత ప‌డిన వారి సంఖ్య 7,268కి చేరింది. నిన్న ఒక్క రోజే 915 కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 8,93,651కి చేరింది. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 1,53,33,851 న‌మూనాల‌ను ప‌రీక్షించిన‌ట్లు బులిటెన్‌లో వెల్ల‌డించారు.


Next Story