ఏపీ క‌రోనా అప్‌డేట్‌.. భారీగా పెరిగిన కేసులు

2442 new corona cases reported in AP.ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 85,822 శాంపిళ్ల‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Aug 2021 12:22 PM GMT
ఏపీ క‌రోనా అప్‌డేట్‌.. భారీగా పెరిగిన కేసులు

ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 85,822 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 2442 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,73,996కి చేరింది. నిన్న 2,412 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,40,368కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో ఐదుగురు, అనంత‌పురంలో ఇద్ద‌రు, కృష్ణ‌లో ఇద్ద‌రు, నెల్లూరులో ఇద్ద‌రు, తూర్పుగోదావ‌రి, గుంటూరు, క‌డ‌ప‌, క‌ర్నూల్‌, విశాఖ‌ప‌ట్నంలో ఒక్కొరు చొప్పున మొత్తం 16 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,444కి చేరింది. ఇక రాష్ట్రంలో 20,184 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,48,63,968సాంపిల్స్ ని పరీక్షించారు.

Next Story