ఏపీలో క‌రోనా విజృంభ‌ణ‌.. 15లక్ష‌లు దాటిన పాజిటివ్ కేసులు

22610 New corona cases reported in AP.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 1,01,281 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 22,610 పాజిటివ్ కేసులు న‌మోదు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 May 2021 1:34 PM GMT
AP Corona cases

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,01,281 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 22,610 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 15,21,142కి చేరింది. నిన్న 23,098 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 13,02,208కి పెరిగింది.

కోవిడ్ వల్ల తూర్పుగోదావ‌రిలో 17 మంది, చిత్తూరులో 15 మంది, తూర్పుగోదావ‌రి, గుంటూరు, విశాఖ‌ప‌ట్నం జిల్లాల్లో 10 మంది, అనంత‌పురం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో 9 మంది, కృష్ణ జిల్లాలో 8 మంది, క‌ర్నూలు, ప్ర‌కాశం జిల్లాల్లో ఏడుగురు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు, క‌డ‌ప‌లో ఇద్ద‌రు చొప్పున మొత్తం 114 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 9,800కి చేరింది. ఇక రాష్ట్రంలో 2,09,134 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 1,83,42,918 సాంపిల్స్ ని పరీక్షించారు.




Next Story