ఏపీలో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా కేసులు.. ఒకే రోజు 99 మ‌ర‌ణాలు

21320 New Cases Reported In AP. ఏపీలో గ‌డిచిన 24 గంట‌ల్లో 91,253 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 21,320 పాజిటివ్ కేసులు న‌మోదు.

By Medi Samrat
Published on : 18 May 2021 5:35 PM IST

AP Corona cases

ఏపీలో క‌రోనా విల‌యం కొనసాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 91,253 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 21,320 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 14,75,372కి చేరింది. నిన్న 21,274 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 12,54,291కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో పది మంది, కృష్ణ లో పది మంది, విజయనగరం లో పది మంది, తూర్పు గోదావరి లో తొమ్మిది, ప్రకాశం లో తొమ్మిది, అనంతపూర్ లో ఎనిమిది, గుంటూరులో ఎనిమిది, విశాఖపట్నంలో ఎనిమిది, పశ్చిమ గోదావరి లో ఎనిమిది, కర్నూ ల్ లో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, నెల్లూరులో ఐదుగురు, వైఎస్ఆర్ కడప లో ఇద్దరు చొప్పున మొత్తం 99 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 9,580కి చేరింది. ఇక రాష్ట్రంలో 2,11,501 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 1,81,40,307 సాంపిల్స్ ని పరీక్షించారు.




Next Story