ఏపీలో క‌రోనా ఉద్దృతి.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

1941 New corona cases in ap.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 31,657 కరోనా టెస్టులు నిర్వహించగా.. 1,941 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 April 2021 1:14 PM GMT
AP Corona cases

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర రూపం దాల్చింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 31,657 కరోనా టెస్టులు నిర్వహించగా.. 1,941 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. అత్య‌ధికంగా గుంటూరు జిల్లాలో 424 కేసులు న‌మోదు కాగా.. ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో 323, విశాఖ జిల్లాలో 258, నెల్లూరు జిల్లాలో 231, కృష్ణా జిల్లాలో 212 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 25 పాజిటివ్ కేసులు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 9,10,943 కి చేరింది.

నిన్న ఒక్క రోజే క‌రోనా కార‌ణంగా ఏడుగురు మృత్యువాత ప‌డ్డారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,251కి చేరింది. కాగా.. ఒక్క రోజులో 835 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 8,91,883కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 11,809 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 1,52,70,771 న‌మూనాల‌ను ప‌రీక్షించిన‌ట్లు బులిటెన్‌లో వెల్ల‌డించారు.


Next Story