ఏపీ క‌రోనా బులిటెన్ విడుద‌ల‌.. త‌గ్గిన కేసులు.. మ‌ర‌ణాలు మాత్రం వంద‌కుపైనే..

18767 New Corona Cases reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 91,629 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 18,767 పాజిటివ్ కేసులు న‌మోదు.

By Medi Samrat  Published on  23 May 2021 12:03 PM GMT
AP Corona cases

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 91,629 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 18,767 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్ర‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 15,80,827కి చేరింది. నిన్న 20,109 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 13,61,464కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో పదిహేను మంది, పశ్చిమ గోదావరి లో పదమూడు మంది, విజయనగరం లో పదకొండు మంది, విశాఖపట్నం లో తొమ్మిది, అనంతపూర్ లో ఎనిమిది, తూర్పు గోదావరిలో ఎనిమిది, గుంటూరు లో ఎనిమిది, కృష్ణ లో ఎనిమిది, కర్నూల్ లో ఎనిమిది, శ్రీకాకుళం లో ఏడుగురు, నెల్లూరు లో ఆరుగురు, వైఎస్ఆర్ కడప లో ముగ్గురు చొప్పున మొత్తం 104 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10,126కి చేరింది. ఇక రాష్ట్రంలో 2,09,237 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 1,86,17,387 సాంపిల్స్ ని పరీక్షించారు.


Next Story