ఏపీ క‌రోనా బులిటెన్ విడుద‌ల‌.. 24 గంట‌ల్లో 99 మ‌ర‌ణాలు

18285 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 91,120 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 18,285 పాజిటివ్ కేసులు న‌మోదు.

By Medi Samrat
Published on : 26 May 2021 5:34 PM IST

AP Corona cases

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 91,120 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 18,285 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 16,27,390కి చేరింది. నిన్న 24,105 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 14,24,859కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో పదిహేను మంది, పశ్చిమ గోదావరి లో పద్నాలుగు మంది, విజయనగరం లో తొమ్మిది, అనంతపూర్ లో ఎనిమిది, తూర్పు గోదావరి లో ఎనిమిది, నెల్లూరు లో ఎనిమిది, ప్రకాశం లో ఎనిమిది, విశాఖపట్నం లో ఎనిమిది, కర్నూ ల్ లో ఆరుగురు, గుంటూరు లో ఐదుగురు, కృష్ణ లో ఐదుగురు, శ్రీకాకుళం లో ఐదుగురు చొప్పున మొత్తం 99 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10427కి చేరింది. ఇక రాష్ట్రంలో 1,92,104 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 1,88,40,321 సాంపిల్స్ ని పరీక్షించారు.


Next Story