ఏపీ కరోనా బులిటెన్.. మరోమారు వందకుపైగా మరణాలు
16167 New Corona Cases reported In AP. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 84,224 శాంపిళ్లను పరీక్షించగా.. 16,167 పాజిటివ్ కేసులు నమోదు.
By Medi Samrat Published on 27 May 2021 12:15 PM GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 84,224 శాంపిళ్లను పరీక్షించగా.. 16,167 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 16,43,557కి చేరింది. నిన్న 21,385 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 14,46,244కి పెరిగింది.
#COVIDUpdates: 27/05/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) May 27, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 16,40,662 పాజిటివ్ కేసు లకు గాను
*14,43,349 మంది డిశ్చార్జ్ కాగా
*10,531 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,86,782#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/XlrILMUh2z
కోవిడ్ వల్ల చిత్తూర్ లో పద్నాలుగు మంది, పశ్చిమ గోదావరి లో పదమూడు మంది, విశాఖపట్నం లో పదకొండు మంది, అనంతపూర్ లో తొమ్మి ది, నెల్లూరు లో తొమ్మిది, గుంటూరు లో ఎనిమిది, విజయనగరం లో ఎనిమిది, ప్రకాశం లో ఏడుగురు, తూర్పుగోదావరి లో ఆరుగురు, కృష్ణ లో ఆరుగురు, కర్నూల్ లో ఆరుగురు, శ్రీకాకుళం లో ఆరుగురు, వైఎస్ఆర్ కడప లో ఒక్కరు చొప్పున మొత్తం 104 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10531కి చేరింది. ఇక రాష్ట్రంలో 1,86,782 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 1,89,24,545 సాంపిల్స్ ని పరీక్షించారు.