ఏపీ క‌రోనా బులిటెన్‌.. ఒక్క రోజులో 106 మ‌ర‌ణాలు

15284 New Corona Case Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 72,979 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 15,284 పాజిటివ్ కేసులు న‌మోదు.

By Medi Samrat
Published on : 25 May 2021 6:34 PM IST

AP corona case updates

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 72,979 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 15,284 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 16,09,105 కి చేరింది. నిన్న 20,917 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 14,00,754కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో పదిహేను మంది, ప్రకాశం లో పదకొండు మంది, పశ్చిమ గోదావరిలో పది, అనంతపూర్ లో తొమ్మిది, తూర్పు గోదావరి లో తొమ్మిది, నెల్లూరు లో తొమ్మిది, విశాఖపట్నం లో తొమ్మిది, కర్నూల్ లో ఎనిమిది, విజయనగరం లో ఎనిమిది, శ్రీకాకుళం లో ఏడుగురు, గుం టూరు లో ఐదుగురు, కృ ష్ణ లో ఐదుగురు, వైఎస్ఆర్ కడపలో ఒక్కరు చొప్పున మొత్తం 106 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10328కి చేరింది. ఇక రాష్ట్రంలో 1,98,023 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 1,87,49,201 సాంపిల్స్ ని పరీక్షించారు.




Next Story