ఏపీ క‌రోనా హెల్త్ బులిటెన్‌.. కొత్త‌గా ఎన్నికేసుంటే..?

New corona cases reported in ap today.ఏపీలో గ‌డిచిన 24 గంట‌ల్లో 86,035 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 14,792 పాజిటివ్ కేసులు న‌మోదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 April 2021 1:19 PM GMT
AP Corona cases

ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 86,035 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 14,792 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్ లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 10,84,336 కి చేరింది. క‌రోనా కార‌ణంగా అనంత‌పురం, విజ‌య‌న‌గ‌రం, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఏడుగురు చొప్పున‌, తూర్పుగోదావ‌రిలో ఆరుగురు, చిత్తూరు, విశాఖ జిల్లాల్లో ఐదుగురు చొప్పున‌, నెల్లూరు, శ్రీకాకుళంలో న‌లుగురు చొప్పున‌, క‌డ‌ప, కృష్ణా, ప్ర‌కాశం జిల్లాలో ముగ్గురు చొప్పున‌, క‌ర్నూలులో ఇద్ద‌రు, గుంటూరులో ఒకరు మొత్తం 57 మంది ప్రాణాలు కోల్పోయారు.

దీంతో ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తి రాష్ట్రంలో మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 7,928కి చేరింది. నిన్న 8,188 మంది కోలుకోగా మొత్తంగా క‌రోనా బారి నుంచి బ‌య‌ట‌ప‌డిన వారి సంఖ్య 9,62,250కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1,14,158 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ రోజు న‌మోదైన కేసుల్లో అత్య‌ధికంగా చిత్తూరులో 1,831 కేసులు న‌మోదు కాగా.. అత్య‌ల్పంగా ప‌శ్చిమ‌గోదావ‌రిలో 596 మంది ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు.


Next Story