ఏపీ కరోనా అప్డేట్.. కొత్తగా ఎన్నికేసులంటే..?
1326 New corona cases in ap.ఆంధ్రప్రదేశ్లోగడిచిన 24 గంటల్లో 30,678 శాంపిళ్లను పరీక్షించగా 1,326 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ
By తోట వంశీ కుమార్ Published on
5 April 2021 12:33 PM GMT

ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 30,678 కరోనా శాంపిళ్లను పరీక్షించగా 1,326 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయినట్లు రాష్ట, వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,09,002 కి చేరింది. చిత్తూరులో జిల్లాలో అత్యధికంగా 282 కేసులు నమోదు కాగా.. అత్పల్పంగా పశ్చిమ గోదావరిలో 01 కేసు నమోదు అయ్యింది. నిన్న ఒక్క రోజే ఐదుగురు మృత్యువాత పడ్డారు. దీంతో కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,244కి చేరింది.
ఒక్క రోజు వ్యవధిలో 911 ఈ మహమ్మారి నుంచి కోలుకుగా మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 8,91,048కి చేరింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 10,710 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,52,39,114 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
Next Story