ఏపీ క‌రోనా బులిటెన్ : 24 గంట‌ల్లో 96 మ‌ర‌ణాలు

12,994 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 58,835 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 12,994 పాజిటివ్ కేసులు న‌మోదు

By Medi Samrat
Published on : 24 May 2021 5:37 PM IST

AP Corona cases

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 58,835 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 12,994 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 15,93,821కి చేరింది. నిన్న 18,373 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 13,61,464కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో పద్నాలుగు మంది, కర్నూల్ లో పది, విజయనగరం లో పది, అనంతపూర్ లో తొమ్మి ది, తూర్పుగోదావరి లో ఎనిమిది, విశాఖపట్నంలో ఎనిమిది, గుంటూరు లో ఏడుగురు, కృష్ణ లో ఏడుగురు, నెల్లూరు లో ఏడుగురు, శ్రీకాకుళం లో ఏడుగురు, పశ్చిమ గోదావరి లో నలుగురు, ప్రకాశం లో ముగ్గురు మరియు వైఎస్ఆర్ కడపలో ఇద్దరు చొప్పున మొత్తం 96 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10,222కి చేరింది. ఇక రాష్ట్రంలో 2,03,762 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 1,86,76,222 సాంపిల్స్ ని పరీక్షించారు.




Next Story