ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా ఎన్నికేసులంటే..?
1271 New corona cases in ap.ఏపీలో గడిచిన 24 గంటల్లో 31,809 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 1,271 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ
By తోట వంశీ కుమార్ Published on
1 April 2021 1:04 PM GMT

ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 31,809 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 1,271 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,03,260కి చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 285 కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 12 కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్క రోజు ముగ్గురు కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో ఈ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,220కి చేరింది.
ఒక్క రోజు వ్యవధిలో 464 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 8,87,898కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,142 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,51,14,988 నమూనాలను పరీక్షించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో వెల్లడించింది.
Next Story