ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. మళ్లీ కొత్త కేసులు వెయ్యికి పైగా నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 71,913 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,121 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాబారినపడి పదకొండు మంది మృతిచెందారు.
ఇదే సమయంలో 1,631 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. తాజా కరోనా నిర్ధారణ పరీక్షలు కలుపుకొని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా టెస్ట్ల సంఖ్య 96,15,090కు చేరింది. తాజాగా చిత్తూరులో ఇద్దరు, కృష్ణలో ఇద్దరు, అనంతపూర్లో ఒక్కరు, తూర్పుగోదావరిలో ఒక్కరు, గుంటూరులో ఒక్కరు, కడపలో ఒక్కరు, విశాఖపట్నంలో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు మరణించారు.
ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,62,213కు చేరుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8,41,026కు పెరిగింది. ఇక 6,938 మంది ఇప్పటి వరకు కరోనాబారినపడి మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,249 యాక్టివ్ కేసులు ఉన్నాయి.